న్యూఢిల్లీ: లోక్సభ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే(Nishikant Dubey) ఇవాళ నోటీసు ఇచ్చారు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఉద్దేశంతో ఆ నోటీసు జారీ చేశానన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్తున్నారని, సోరస్ ఫౌండేషన్, యూఎస్ఏఐడీ, ఫోర్డ్ ఫౌండేషన్ లాంటి సంస్థలతో చేతులు కలిపి.. దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లు దూబే ఆరోపించారు. ఇదేమీ ప్రివిలేజ్ మోషన్ కాదు అని, సబ్స్టాంటివ్ మోషన్ నోటీసు ఇస్తున్నానని బీజేపీ ఎంపీ వెల్లడించారు. విదేశీ ఫౌండేషన్లతో జతకట్టిన రాహుల్ గాంధీ.. వియత్నాం, కంబోడియా, థాయ్ల్యాండ్ దేశాలకు పర్యటిస్తున్నట్లు ఆరోపించారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయండా నిషేధం విధించాలని తన నోటీసులో డిమాండ్ చేసినట్లు ఎంపీ దూబే పేరన్కొన్నారు.
VIDEO | Parliament Budget Session: BJP MP Nishikant Dubey on Union Minister Kiren Rijiju’s remark that the government will move a privilege motion against Lok Sabha Leader of Opposition Rahul Gandhi says, “There is no privilege motion. I have submitted a substantive motion… pic.twitter.com/AdriKwXMEo
— Press Trust of India (@PTI_News) February 12, 2026