లక్నో: దేశంలో నిరుద్యోగాన్ని అరికట్టేందుకే ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పిల్లల్ని కనలేదని బీజేపీ ఎంపీ అన్నారు. (BJP MP Nirahua) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఇది డీప్ఫేక్ వీడియో అని బీజేపీ ఆరోపించింది. వీడియో వైరల్ చేసిన కాంగ్రెస్పై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ ఎంపీ దినేష్ లాల్ యాదవ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగాన్ని అరికట్టేందుకు మోదీ, యోగి ఒక్క బిడ్డను కూడా కనలేదని అన్నారు. ‘మోదీ, యోగి నిరుద్యోగ సమస్యను పరిష్కరించారు. ఎందుకంటే వారికి పిల్లలు లేరు. దీనికి విరుద్ధంగా, ఎక్కువ మంది పిల్లలున్న వారు నిరుద్యోగం పెరగడానికి దోహదపడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, నిరాహువాగా పాపురల్ అయిన బీజేపీ ఎంపీ దినేష్ లాల్ యాదవ్కు సంబంధించిన ఈ వీడియో క్లిప్ను యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయ్యింది.
మరోవైపు ఈ వీడియోపై బీజేపీ స్పందించింది. తమ నేత దినేష్ అలా మాట్లాడలేదని, అది ‘డీప్ఫేక్’ వీడియో అని ఆరోపించింది. ఇలాంటి వీడియోల ద్వారా ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవపట్టిస్తున్నదని బీజేపీ ఐటి సెల్ చీఫ్ అమిత్ మాల్వియా విమర్శించారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
फेक वीडियो प्रमोट करने का ट्रेंड हो गया है @INCIndia वालों का, कोई भी देखकर समझ जाएगा कि ओंठ कुछ और बोल रहा है। AI से साउंड क्लोन करके क्या साबित करना चाहते हैं @srinivasiyc . @ECISVEEP कृपया संज्ञान लें। https://t.co/VdnjaQ1UXN
— Nirahua Hindustani (modi ka parivar) (@nirahua1) April 15, 2024