న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా(BJP MP Jayant Sinha) కూడా గౌతం గంభీర బాట పట్టారు. తనను రాజకీయ విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఇవాళ ఉదయం ఎంపీ గౌతం గంభీర్.. బీజేపీ నాయకత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. క్రికెట్పై ఫోకస్ పెట్టేందుకు తనను రాజకీయాల నుంచి తప్పించాలని గంభీర్ కోరుకున్నారు. రాజకీయాల్లో అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షాలకు ఆయన థ్యాంక్స్ తెలిపారు.
ఎంపీ జయంత్ సిన్హా కూడా ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని ఆయన నడ్డాను కోరారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపుతున్న గ్లోబల్ వార్మింగ్ అంశంపై ఫోకస్ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీ జయంత్ వెల్లడించారు. ఆర్థిక, పరిపాలనా అంశాల్లో మాత్రం పార్టీతో కలిసి పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు.
I have requested Hon’ble Party President Shri @JPNadda ji to relieve me of my direct electoral duties so that I can focus my efforts on combating global climate change in Bharat and around the world. Of course, I will continue to work with the party on economic and governance…
— Jayant Sinha (@jayantsinha) March 2, 2024