న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర మధ్య వాగ్యుద్ధం జరిగింది. దర్శన్ హీరానందానీ అనే వ్యాపారవేత్త ప్రయోజనాలను కాపాడటం కోసం పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా ముడుపులు స్వీకరించారని, దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు దూబే ఆదివారం లేఖ రాశారు.
దీనిపై మహువా స్పందిస్తూ, దూబే నిజమైన డిగ్రీని కొనుక్కోవడానికి వీలుగా ఓ కళాశాలను కొనేందుకు తాను తన అక్రమ సంపాదనను ఉపయోగిస్తున్నానని అన్నారు. ఈ ట్వీట్ను లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ట్యాగ్ చేశారు. ఫేక్ డిగ్రీవాలాకు వ్యతిరేకంగా అనేక ప్రివిలెజ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని, వాటి దర్యాప్తు చేయడం పూర్తయిన తర్వాత తన వద్దకు రావాలని అన్నారు.