న్యూఢిల్లీ, జనవరి 8: ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పంకజ్ గుప్తాను ఓ రైతు చెంపదెబ్బ కొట్టడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలో ఈ ఘటన ప్రతిపక్షాలకు కొత్త ఆయుధంగా మారింది. యోగి విధానాలపై రైతుల అసంతృప్తికి, ఆగ్రహానికి ఈ ఘటన నిదర్శనమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉన్నావ్లో పంకజ్ గుప్తా మూడు రోజుల కింద ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ రైతు వేదికపైకి వచ్చి పంకజ్ గుప్తాను కొట్టాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై పంకజ్ గుప్తా మాట్లాడారు. రైతు తనకు తండ్రిలాంటి వాడని, గతంలో కూడా అలా చేశాడని చెప్పుకొచ్చారు. సందర్భాన్ని ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని ఆరోపించారు.