లక్నో: ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓటర్ల క్షమాపణలు కోరారు. ఐదేండ్ల కాలంలో తాను చేసిన తప్పులను క్షమించాలని వేడుకున్నారు. అక్కడితో ఆగక కుర్చీపైకి ఎక్కి చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు కూడా తీశారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. రాబర్ట్స్గంజ్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే భూపేష్ చౌబే ఈసారి కూడా అదే స్థానం నుంచి తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్థానిక ప్రజలకు ఆ ఎమ్మెల్యేపై ఆగ్రహం ఉన్నప్పటికీ బీజేపీ మళ్లీ టికెట్ ఇచ్చింది. మార్చి 7న జరిగే చివరి ఏడో దశలో ఇక్కడ పోలింగ్ జరుగనున్నది.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తన నియోజకవర్గంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే భూపేష్ చౌబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను, నియోజకవర్గం ప్రజలను పొడగ్తలతో ముంచెత్తారు. మరోసారి వారి ఆశీసులు తనకు కావాలని కోరారు. 2017లో మాదిరిగా తనను ఎమ్మెల్యేగా తిరిగి గెలిపించాలని అభ్యర్థించారు.
అంతటితో ఆగని భూపేష్ చౌబే ఉన్నట్టుండి తన కుర్చీపైకి ఎక్కారు. చేతులతో రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీశారు. గత ఐదేండ్లలో తన వల్ల జరిగిన తప్పులను క్షమించాలని వేడుకున్నారు. అయితే వేదికపై ఉన్న మిగతా బీజేపీ నేతలు ఆయనను వారించేందుకు ప్రయత్నించారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी के एक BJP विधायक, पिछले 5 साल की गलतियों की माफी मांग रहे हैं.
क्या लगता है, जनता माफ करेगी?pic.twitter.com/VZyIBjEwgn
— Ranvijay Singh (@ranvijaylive) February 23, 2022