న్యూఢిల్లీ: ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా ‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’ అనే పాటలే వినిపిస్తాయని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ చెప్పారు. ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ ‘ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఖేల్ ఖతం అయ్యింది. ఇక ఆ పార్టీకి వీడ్కోలే. 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనున్నది. ఆ రోజు ఉదయం దాదాపు 10 గంటలకు ఎక్కడ చూసినా మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై, చల్ సన్యాసి మందిర్ మే అనే పాటలే వినిపిస్తాయి. ప్రస్తుతం బీజేపీ పోరాటమంతా తన ఉనికి కాపాడుకోవడానికి, గౌరవప్రదమైన సీట్లలైనా సాధించడానికే’ అని పేర్కొన్నారు. కాగా సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎస్బీఎస్పీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.