భోపాల్: మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో బీజేపీ రికార్డు క్రియేట్ చేసింది. ఐదోసారి ఆ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. ఎన్నికల సంఘం వెబ్సైట్ ప్రకారం.. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 161 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. 2003 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సర్కారును నడిపిస్తోంది. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినా.. 2020లో జరిగిన పరిణామాల వల్ల కమల్నాథ్ సర్కారు కూలిపోయింది.
జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటు చేయడంతో.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీతో సింథియా చేరడంతో.. ఆ పార్టీ సర్కారును ఏర్పాటు చేసింది. అయితే 2003 నుంచి మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న కారణంగా.. ఆ పార్టీ వరుసగా అయిదోసారి రాష్ట్రాన్ని చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది.