జైపూర్: రాజస్థాన్(Rajasthan Assembly Results)లో కాంగ్రెస్ సర్కార్కు జలక్ తగిలింది. ఆ రాష్ట్రంలో బీజేపీ పార్టీ దూసుకెళ్తున్నది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ పార్టీ 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ 79 స్థానాల్లో లీడింగ్లో ఉంది. రాజస్థాన్ అసెంబ్లీలో 199 సీట్లు ఉన్నాయి. అయితే 100 సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈసారి రెండు పార్టీలకు చెందిన రెబల్స్ ఎన్నికల్లో పోటీ చేశారు. దాదాపు 40 మంది రెబల్స్ రాజస్థాన్ పోరులో నిలిచారు. 2018 ఎన్నికల్లో బీజేపీ ఓట్ షేర్ 38.77 శాతం, బీజేపీకి 39.30 ఓటు శాతం ఉంది.
జల్రాపతన్లో వసుంధర రాజే, సర్దార్పురాలో సీఎం గెహ్లాట్ లీడింగ్లో ఉన్నారు. జల్రాపతన్ నియోజకవర్గం నుంచి వసుంధర రాజే 2003 నుంచి పోటీ చేస్తున్నారు. ఇక సీఎం గెహ్లాట్ 1998 నుంచి సర్దార్పురా నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. సర్దార్పురా సీటు కోసం బీజేపీ అభ్యర్థి మహేంద్ర సింగ్ రాథోడ్ పోటీలో ఉన్నారు.