‘మా ఊర్లోకి బీజేపీ నేతలకు ప్రవేశం లేదు’ అని యూపీలోని షామ్లీ జిల్లా లయన్ గ్రామ ప్రజలు ఊరు ప్రారంభంలో బోర్డు పెట్టారు. తమ ఇంటి గేట్లకు, తలుపులకు కూడా ఇవే ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే తాజీందర్ నర్వాల్పై అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సాగు చట్టాలు తేవడం కూడా అక్కడి ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత పెంచింది. అందుకే ఈసారి బీజేపీకి ఓటేయబోమని ఆ గ్రామస్థులు చెప్తున్నారు. ఎస్పీ మిత్రపక్షం రాష్ట్రీయ లోక్దళ్ (ఆరెల్డీ) నేతలు గ్రామంలోకి రావొచ్చని పేర్కొన్నారు.