జైపూర్ : రాజస్ధాన్లో(Rajasthan Poll Results) పాలక కాంగ్రెస్ను మట్టికరిపించి బీజేపీ అధికారం దిశగా దూసుకుపోతోంది. 199 స్ధానాలు కలిగిన రాజస్ధాన్ అసెంబ్లీలో బీజేపీ 108 సీట్లతో మేజిక్ మార్క్ను దాటి పరుగులు పెడుతుండగా కాంగ్రెస్ కేవలం 75 స్ధానాల్లో ఆధిక్యానికే పరిమితమైంది.
రాజస్ధాన్లో అశోక్ గెహ్లాట్ మాయాజాలానికి ప్రజలు చెల్లుచీటీ ఇచ్చారని, బీజేపీకి పట్టం కడుతున్నారని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు తిప్పికొట్టారని అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిప్పికొట్టారని మంత్రి పేర్కొన్నారు.
అశోక్ గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రజలు గెహ్లాట్ సర్కార్ను సాగనంపి కాషాయ పార్టీని అందలం ఎక్కించారని కేంద్ర మంత్రి అన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్, ఛత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది.
Read More :