న్యూఢిల్లీ, మార్చి 25: రాహుల్ గాంధీపై అనర్హత వేటు అంశం బీజేపీ నేత, నటి ఖుష్బూ సుందర్కు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. మోదీ పేరును ఉద్దేశించి ఆమె గతంలో చేసిన ఓ ట్వీట్ తాజా పరిణామాల నేపథ్యంలో వైరల్గా మారింది. ‘మోదీ’ ఇంటి పేరు అర్థాన్ని ‘అవినీతి’గా పునర్నిర్వచించాలని, అది సరిగ్గా సరిపోతుందని 2018 ఫిబ్రవరి 15న ట్వీట్ చేశారు. ‘నీరవ్, లలిత్, నమో=అవినీతి’ అంటూ ఆ ట్వీట్లో విమర్శించారు. ఈ నేపథ్యంలో ఎంపీ దిగ్విజయ్సింగ్తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఖుష్బూ చేసిన ట్వీట్ను షేర్ చేస్తూ ఆమెపై బీజేపీ చర్యలు తీసుకుంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఖుష్బూ 2020లో బీజేపీలో చేరారు.