జైపూర్, డిసెంబర్ 15: రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రిగా భజన్లాల్ శర్మ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్లోని చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ ఎదురుగా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎంగా భజన్లాల్తో పాటు డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్చంద్ భైరవాలతో గవర్నర్ కల్రాజ్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కర్యాక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా, పలువురు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ర్టాల సీఎంలు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తదిరులు హాజరయ్యారు.
తన పుట్టిన రోజు నాడునే భజల్లాల్ శర్మ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించడం విశేషం. ఈ కార్యక్రమానికి కొంచెం ముందుగానే హాజరైన మాజీ సీఎం అశోక్ గెహ్లాట్.. తన రాజకీయ ప్రత్యర్థి అయిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పక్కనే కూర్చొని ముచ్చట్లు పెట్టడం అందరినీ ఆకర్షించింది.