బోఫాల్, నవంబర్ 27: మధ్యప్రదేశ్లోని సొంత పార్టీ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం ఉమాభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాదోల్ పట్వారీ ప్రసన్న సింగ్ను ఇసుక మాఫియా ట్రాక్టర్తో తొక్కి చంపడం సిగ్గుచేటు, అగౌరవమని ఆమె వ్యాఖ్యానించారు.
‘ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇసుక మాఫియా చంపడం మొత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వ వ్యవస్థకు, సమాజానికి, పరిపాలనకు సిగ్గుచేటు, అగౌరవం. నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆమె సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు.