చండీగఢ్: పంజాబ్లో లోక్సభ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు బీజేపీ మంగళవారం ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో పొత్తు చర్చలు విఫలమైనట్టు పరోక్షంగా తెలిపింది. 13 లోక్సభ స్థానాలున్న పంజాబ్లో ఈసారి చతుర్ముఖ పోటీ నెలకొన్నది. ఏడు దశల్లో తలపెట్టిన సార్వత్రిక ఎన్నికల్లో చివరి దశ జూన్ 1న ఈ రాష్ట్రంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 1996 నుంచి ప్రతి ఎన్నికల్లో ఎస్ఏడీ, బీజేపీ కలిసి పోటీ చేస్తూ వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో చెరో రెండు ఎంపీ స్థానాల్ని గెలుచుకున్నాయి. మోదీ సర్కార్ తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు నిరసనగా, ఎన్డీయే కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ 2020 సెప్టెంబర్లో బయటకు వచ్చింది.