కోల్కతా, మార్చి 24: బెంగాల్లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్పై బీజేపీ మరోసారి బెదిరింపులకు దిగింది. ప్రజాస్వామికంగా ఎన్నికైన ఆ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ హెచ్చరికలు చేసింది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ టీఎంసీ కన్నా ఒక్క సీటు ఎక్కువ గెల్చినా మమత ప్రభుత్వం 2026 వరకు ఉండదని, పదవీకాలం పూర్తి కాకుండానే పడిపోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ హెచ్చరించారు. ఆయన ఆదివారం పీటీఐతో మాట్లాడుతూ ఈ లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో 35 సీట్లను గెల్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ ఎన్నికల్లో టీఎంసీ కన్నా ఒక్క సీటు ఎక్కువ గెల్చినా మమత ప్రభుత్వం కుప్పకూలుతుందని అన్నారు.