న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లో గత 15 ఏండ్లుగా అధికారం చలాయిస్తున్న భారతీయ జనతాపార్టీ ఇక్కడి ప్రజల కోసం చేసిందేమీ లేదని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మండిపడ్డారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
ఇవాళ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పోలింగ్ జరుగుతోందని, దాదాపు కోటిన్నర మంది ఢిల్లీ వాసులు ఓటు వేయబోతున్నారని, కాబట్టి సరిగ్గా పని చేస్తుందని నమ్మిన పార్టీనే ఈ ఎన్నికల్లో గెలిపించాలని తాను ఓటర్లను కోరుతున్నానని సిసోడియా కోరారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ప్రధాన కర్తవ్యమని, తాము గెలిస్తే ఢిల్లీని క్లీన్ చేస్తామని చెప్పారు.