భోపాల్, డిసెంబర్ 30: శ్రీరాముడిని, హనుమంతుడిని పూజించడానికి కేవలం బీజేపీకి మాత్రమే కాపీరైట్ లేదని ఆ పార్టీ కీలక నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ హనుమంతుడి ఆలయ నిర్మాణం చేపట్టడాన్ని ఆమె సమర్థించారు.
సొంత పార్టీపై ఆమె ఇటీవల విమర్శలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యపాన నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఓ మద్యం షాపుపై ఆమె రాళ్లు కూడా విసిరారు.