న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్రంలోని అధికార బీజేపీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో దాదాపు రూ.1,300 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇది కాంగ్రెస్కు వచ్చిన విరాళాలు రూ.171 కోట్ల కంటే ఏడు రెట్లు అధికం. 2022-23లో మొత్తంగా బీజేపీకి రూ.2,120 కోట్ల విరాళాలు రాగా, అందులో ఎలక్టోరల్ బాండ్లవి 61 శాతంగా ఉన్నాయి. బీజేపీ తన వార్షిక ఆడిట్ నివేదికలో దీనిని వెల్లడించింది.