న్యూఢిల్లీ, జనవరి 28: భారతీయ జనతాపార్టీ 2019-20 సంవత్సరానికి ప్రకటించిన ఆస్తుల విలువ రూ.4,847 కోట్లని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) ఒక నివేదికలో తెలిపింది. ఆస్తుల్లో జాతీయ పార్టీల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో బీఎస్పీ (రూ.698.33 కోట్లు), కాంగ్రెస్ (రూ.588.16 కోట్లు) ఉన్నాయి. ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల విలువ వరుసగా రూ.6,988.57 కోట్లు, రూ.2129.38 కోట్లుగా ఉన్నట్టు నివేదికలో పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్వాదీ పార్టీ రూ.563.47 కోట్లతో ప్రథమ స్థానంలో ఉన్నది.