(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 2 : ప్రధాని నరేంద్రమోదీ స్వరాష్ట్రం గుజరాత్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఆమ్రేలి సిట్టింగ్ ఎంపీ నారన్ కచ్చాడియా స్థానంలో మరో నేత భరత్ సుతారియాకు టికెట్ను కేటాయించడం అసమ్మతికి దారితీసింది. పార్టీ క్యాడర్ రెండువర్గాలుగా చీలి రాళ్లు, కర్రలతో కొట్టుకొనే స్థాయికి చేరింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు గాయాలపాలై దవాఖానలో చేరారు.
రాష్ట్రస్థాయి నాయకత్వం జోక్యం చేసుకొన్నప్పటికీ పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఒక్క ఆ మ్రేలిలోనే కాదు.. సబర్కాంతా, రాజ్కోట్, వడోదరా, వల్సాద్, జునాగద్ తదితర ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులను మార్చాలంటూ బీజేపీకి కార్యకర్తల నుంచి నిరసన సెగ తగులుతున్నది. రాష్ర్టాధ్యక్షుడు సీఆర్ పాటిల్కు ఆయా నియోజకవర్గాల కార్యకర్తలు లేఖలు రాయడమే దీనికి నిదర్శనం. కాగా, గడిచిన పదేండ్లలో గుజరాత్లో బీజేపీకి కార్యకర్తల నుంచి ఈ స్థాయిలో అసమ్మతి సెగ రావడం చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు