దేశ రాజధాని ఢిల్లీలోని కుతుమ్మినార్ నిర్మాణంపై వివాదం కొనసాగుతున్నది. తాజాగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లద్ పటేల్ కూడా ఇందులో చేరారు. 27 ఆలయాలు కూల్చి కుతుబ్మినార్ను నిర్మించారనే వాదనను ఆయన పునరుద్ఘాటించారు.
కుతుబ్మినార్ కాంప్లెక్స్లో దొరికిన విగ్రహాలకు సంబంధించిన కేసుపై మంగళవారం ఆయన స్పందిస్తూ ఆలయాలు కూల్చి నిర్మాణాలు చేపట్టడం దురదృష్టకరమని, ఇటువంటి హిందూ వ్యతిరేక సెంటిమెంట్ ప్రబలకుండా చూడాలన్నారు. మరోవైపు కుతుబ్మినార్ కాంప్లెక్స్లో 27 హిందూ, జైన్ ఆలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణను ఢిల్లీలోని సాకేత్ కోర్టు ఈనెల 24కు వాయిదా వేసింది.