కోల్కతా, ఆగస్టు 15: ఎన్డీయే అధికారంలో లేని రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నదని బెంగాల్ సీఎం మమతాబెనర్జీ దుయ్యబట్టింది. టీఎ ంసీ నేత అనుబ్రతను సీబీఐ అరెస్టు చేయడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశా రు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు.
బీజేపీ భయపడుతున్నదని, అందుకే తన ఇమేజీని నాశనం చేసేందుకు ఎజెండా రూపొందించిందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవదనే భయంతోనే ఇలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ‘మీరెప్పుడైనా రాయ ల్ బెంగాల్ టైగర్ను చూశారా..? ధైర్యముం టే వచ్చి చూడండి’ అని సవాల్ చేశారు.