కోల్కతా: తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తన భద్రతా అధికారి వివేక్ దూబేను ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించిందన్నారు. మంగళవారం మెజియా, ఛాత్నాల్లో ఎన్నికల ప్రచార సభల్లో మమత మాట్లాడుతూ.. హోంమంత్రి అమిత్ షా చెప్పుచేతల్లో ఈసీ ఉందని, అది బీజేపీ పనిముట్టుగా మారిపోయిందన్నారు.