Madhya Pradesh | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గురువారం తెలంగాణలో పోలింగ్ ముగిసిన తర్వాత వివిధ మీడియా సంస్థలు ఐదు రాష్ట్రాల్లో పార్టీల విజయావకాశాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్య ప్రదేశ్లో.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి.
2018-20 మధ్య కొన్ని నెలలు మినహా 2005 నుంచి రాష్ట్ర సీఎంగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్.. ఐదో టర్మ్ సీఎం కావాలని తహతహలాడుతున్నా.. బీజేపీ అధిష్టానం ఆయనను సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ మద్దతుతో మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సారధ్యం వహించారు. 230 స్థానాలు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ రావడానికి 116 సీట్లు కావాలి.
సర్వే సంస్థ —- —- —- బీజేపీ — కాంగ్రెస్ – బీఎస్పీ + – ఇతరులు
ఏబీపీ న్యూస్- సీ ఓటర్ — 88-112 – 113-137 – 0 — — 2-8
దైనిక్ భాస్కర్ — — — 95-115 – 105-120 – 0 — — 0-15
ఇండియా టుడే –
యాక్సిస్ మై ఇండియా — 140-162 – 68-90 – 0-2 — — 0-1
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ – 140-159 – 70-89 – 0 — — — 0-2
జన్ కీ బాత్ — — — — 100-123 – 102-125- 0 — — 5
న్యూస్ 24 –
టుడే చాణక్య —– —– 151 – 74 – 0 — 5
రిపబ్లిక్ టీవీ – మ్యాట్రిజ్ — 118-130 — 97-107 — 0 — — 0-2