న్యూఢిల్లీ : సనాతన ధర్మం (Santanana Remark) మలేరియా, డెంగ్యూ, కరోనా వంటిదని దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత, కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తోసిపుచ్చారు. స్టాలిన్ ఆలోచనాధరోణి దోమ అంతటి చిన్నదని, మలేరియా అంతటి మురికితో కూడుకున్నదని దుయ్యబట్టారు.
ఉదయనిధి స్టాలిన్ ఓ హిట్లర్ అని మండిపడ్డారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్ధించింది. సమానత్వాన్ని ప్రోత్సహించని, మనిషిని మనిషిగా గౌరవించని ఏ మతమైనా మతం కాదని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు. సమాన హక్కులు ఇవ్వని ఏమతమైనా, మిమ్మల్ని మనిషిగా చూడని మతమేదైనా అది వ్యాధి వంటిదని అన్నారు.
ఇక అన్ని ధర్మాలను సమభావంతో చూడటమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి దాని అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉందని, ప్రతి ఒక్కరి విశ్వాసాలను తాము గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు.
Read More :