అమృత్సర్ : పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చతికిల పడిపోయింది. కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది బీజేపీ. పంజాబ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశ్విని కుమార్ శర్మ గెలిచారు. ఆశ్విని కుమార్ పఠాన్కోట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. మొత్తం 117 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 89 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 18 స్థానాల్లో ముందంజలో ఉంది. శిరోమణి అకాలీదళ్ ఆరు స్థానాల్లో లీడ్లో ఉంది.