పనాజీ: ఎన్నికల్లో ఒక్కరు బరిలో దిగి గెలువడమే గగనమంటే గోవాలో మాత్రం దంపతులు విజయకేతనం ఎగురవేశారు. అది కూడా ఒక్క జంట కాదు, ఇద్దరు వేర్వేరు దంపతులు. ఈ రెండు జంటలు కూడా బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం. బీజేపీ అభ్యర్థి అటనాసియో మాన్సెరట్టే గోవా రాజధాని పనాజీ నుంచి విజయం సాధించగా, ఆయన సతీమణి జెన్నిఫర్ మాన్సెరట్టే తలైగావ్ నుంచి గెలిచారు.
ఇక మరో బీజేపీ అభ్యర్థి విశ్వజిత్ రాణే వాల్పోయ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన సతీమణి దేవియ విశ్వజిత్ రాణే పోరియం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గోవా బీజేపీలో మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు గెలువగా వారిలో నలుగురు రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం.