Bitcoin Scam | కర్ణాటకలో బిట్కాయిన్ స్కాం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి.. జన్ధన్ ఖాతాలను హ్యాక్ చేసి రూ.6000 కోట్లు స్వాహా చేశాడని రాష్ట్ర మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. శ్రీకృష్ణ హ్యాకింగ్ ద్వారా ఒక్కో జన్ధన్ ఖాతా నుంచి రూ.2 ట్రాన్స్ఫర్ చేశాడని అభియోగం. ఇది ఎంత వరకు నిజమో తనకు తెలియదని, కేవలం జన్ధన్ ఖాతాల నుంచే రూ.6000 కోట్లు స్వాహా చేశాడని కుమారస్వామి అన్నారు.
అయితే, ఈ స్కామ్ను రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం మసిపూసి మారేడుకాయ చేస్తున్నదని సందేహాలు ఉన్నాయన్నారు. భారత్తోపాటు పలు దేశాలు బిట్ కాయిన్కు చట్ట బద్ధత కల్పించలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు మాట్లాడుతూ.. ఈ స్కామ్లో పలుకుబడి గల రాజకీయ నేతలు ఉన్నారని ఆరోపించారు.
కాగా, అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి అధికారులు రూ.9 కోట్ల విలువైన బిట్ కాయిన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ వైబ్సైట్లను శ్రీకృష్ణ హ్యాక్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయన బిట్ కాయిన్ల రూపంలో చెల్లింపులు జరిపి డార్క్ నెట్ ద్వారా మత్తు పదార్థాలు విక్రయించాడని అభియోగం.
కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ బిట్ కాయిన్ స్కామ్ వల్ల సీఎం బస్వరాజ్ బొమ్మై మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. 2008-13 మాదిరిగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మూడో సీఎంను చూడొచ్చని జోస్యం కూడా చెప్పారు.
ఇదిలా ఉంటే, గురువారం ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని సీఎం బస్వరాజ్ బొమ్మై కలుసుకున్నారు. ఈ స్కామ్ గురించి ఆందోళన చెందొద్దని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని, విధేయతతో పని చేయాలని తనను ఆదేశించారని బొమ్మై చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bhagyasree Daughter | జూనియర్ భాగ్యశ్రీ ఎంట్రీకి లైన్క్లియర్..!
SBI Alert | ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక.. అదేమిటంటే?!
5G Auction | ఏప్రిల్-మేలో 5జీ స్పెక్ట్రం వేలం.. ట్రాయ్లోనూ మార్పులు!
క్రిప్టోకరెన్సీలతో ఆర్ధిక వ్యవస్ధకు ముప్పు : ఆర్బీఐ గవర్నర్