న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాధికారాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు సంబంధించిన బిల్లును మంగళవారం క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని గురువారం రాజ్యసభలో, సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నది. మరోవైపు పలు పార్టీలు గురువారం తప్పనిసరిగా రాజ్యసభకు హాజరుకావాలని ఎంపీలకు విప్ జారీచేశాయి. బిల్లును నెగ్గించుకొనేందుకు లోక్సభలో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ, రాజ్యసభలో మెజార్టీ లేదు. వైసీపీ, బీజేడీ వంటి తటస్థ పార్టీలతోపాటు స్వతంత్రులపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
రాజ్యసభలో ఎంపీల బలాబలాలు
ఎన్డీయే-101, విపక్ష ఇండియా-100, నామినేటెడ్ సభ్యులు-5, స్వతంత్రులు-3. ఏ కూటమిలో లేని పార్టీలు-28 బీఆర్ఎస్-7, వైసీపీ-9, బీజేడీ-9, బీఎస్పీ-1, జేడీఎస్-1, టీడీపీ-1