న్యూఢిల్లీ: బిల్కిస్ బానో రేపిస్టులను శిక్షకాలం పూర్తికాకుండానే గుజరాత్ సర్కారు విడుదల చేయడాన్ని కొట్టివేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సమీక్షించాలని గుజరాత్ ప్రభుత్వం మంగళవారం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరింది. దోషుల విడుదలలో గుజరాత్ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కోర్టు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దోషులు తిరిగి లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో 11 మంది దోషులు ఇటీవల లొంగిపోయారు.