కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో రోడ్డుపైకి ఏనుగుల గుంపు రావడంతో బైకర్లు వాహనాలను పడేసి పరుగు లంఘించుకున్న ఘటన (Viral Post) వెలుగుచూసింది. నార్త్బెంగాల్లోని సుక్నా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకోగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఏనుగుల గుంపు రోడ్డు దాటేందుకు రాగా అటుగా వెళుతున్న వాహనదారులు భీతిల్లారు. ఏనుగులు తమకు చేరువగా రావడంతో భయపడిన వాహనదారులు బైక్లను అక్కడే పడేసి పరుగులు తీశారు. రెప్పపాటులో ఏనుగుల నుంచి తప్పించుకున్న బైకర్లు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. కొద్దిగా ఆలస్యమైతే గజరాజులు వారిని ఢీకొనేవి.ఆ సమయంలో బైకర్ల కండ్లలో భయం స్పష్టంగా కనిపించింది. ఎలిఫెంట్ జోన్ కావడంతో ఈ మార్గంలో వెళ్లే సమయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు కోరారు.
Read More