కోల్కతా, జనవరి 13: బీకానేర్-గువాహటి ఎక్స్ప్రెస్ రైలు గురువారం బెంగాల్లోని జల్పాయ్ గుడి జిల్లా దోమోహాని వద్ద ప్రమాదానికి గురైంది. ఐదుగురు మరణించగా, 45 మందికిపైగా గాయపడ్డారు. సాయంత్రం 5 గంటల సమ యంలో కొన్ని బోగీలు పట్టాలు తప్పగా, మరికొన్ని బోల్తాపడ్డాయి. 12 బోగీలు దెబ్బతిన్నాయి. అలీపూర్దువార్ డివిజన్ పరిధిలోని న్యూదోమోహానీ, న్యూమాయనాగుడి స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై ప్రధా ని మోదీ బెంగాల్ సీఎం మమతతో ఫోన్లో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపా రు. శుక్రవారం ప్రమాదస్థలాన్ని సందర్శించనున్నట్టు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మరణించినవారి కుటుంబాలకు రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, సాధారణ గాయాలైనవారికి రూ.25 వేలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.