Encounter | ఛత్తీస్గఢ్ బీజాపూర్ బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు నక్సల్స్లో ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళా నక్సల్స్ ఉన్నారు. ఘటనా స్థలం నుంచి బలగాలు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 20 నుంచి 25 మంది సాయుధ నక్సల్స్ సంచరిస్తున్నట్లుగా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు డీజీఆర్, కోబ్రా సంయుక్త బృందం అటవీ ప్రాంతానికి చేరుకొని ఆపరేషన్ చేపట్టింది.
ఈ క్రమంలో ఉదయం 7.30 గంటల సమయంలో బెలంగుట్ట కొండ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు, సంస్థ ప్రచార సామాగ్రి, నక్సలైట్ యూనిఫాంలు, గూళ్లు, మందులు, నిత్యావసర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటన అనంతరం సంఘటనా స్థలంలో గాలింపులు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.