బిహార్ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాం మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు అసలు దేవుడే కాదని వ్యాఖ్యానించారు. తనకు రాముడిపై విశ్వాసం లేదని పేర్కొన్నారు. రాముడు అనేది ఓ పాత్ర అని, ఆ పాత్రను తులసీదాస్, వాల్మీకి తమ తమ రాతల్లో చొప్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాల్మీకి రామాయణం రచించారని, తులసీదాస్ ఇతర రచనలు చేశారని, అందులో మంచి విషయాలున్నాయని అన్నారు. అయితే తమకు తులసీదాస్, వాల్మీకిపై పూర్తి విశ్వాసం ఉంది కానీ… రాముడిపై లేదని వ్యాఖ్యానించారు.
మీరు రాముడ్ని నమ్మితే.. శబరి ఇచ్చిన ఎంగిలి పండ్లను తిన్నారని ఎప్పుడో నుంచో మేము వింటున్నాం. మేము కొరికిన పండ్లను మీరు తినరు. ముట్టుకోరు అంటూ జితిన్ రాం వ్యాఖ్యానించారు. దేశంలో రెండే కులాలున్నాయని, ఒకటి ఉన్నోళ్లు, రెండు లేనోళ్లు.. అంతే అని మాంఝీ పేర్కొన్నారు.