పట్నా: బీహార్లో కరోనా మహమ్మారి ( Covid-19 ) విజృంభిస్తున్నది. సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో కరోనా మహమ్మారి బారినపడుతున్నారు. తాజాగా బీహార్ క్యాబినెట్లోని ఇద్దరు ఉపముఖ్యమంంత్రులు, ముగ్గురు మంత్రులు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాగా వారికి పాజిటివ్గా తేలింది. డీప్యూటీ సీఎంలు రేణూదేవి, తార్కిషోర్ ప్రసాద్.. మంత్రులు సునీల్ కుమార్, అశోక్ చౌధరి, విజయ్ చౌధరి కొత్తగా కరోనా సోకినవారిలో ఉన్నారు.
ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీకి, ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకింది. మంగళవారం బీహార్లో మొత్తం 893 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 565 కేసులు రాజధాని పట్నాలోనే నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో సీఎం నితీశ్కుమార్ ఇటీవల ప్రకటించిన కొవిడ్ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.