పట్నా: బీహార్లో కరోనా మహమ్మారి విస్తృతి వేగవంతమైంది. దాంతో సీఎం నితీశ్కుమార్ నిబంధనలు కఠినతరం చేశారు. అయినా వైరస్ విస్తృతి కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులకే వైరస్ సోకింది. ఉపముఖ్యమంత్రి రేణూదేవి, మరో మంత్రి సునీల్ కుమార్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. ఇటీవల బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీకి, ఆయన కుటుంబసభ్యులకు కూడా కరోనా సోకింది.
కాగా, మంగళవారం బీహార్లో మొత్తం 893 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో 565 కేసులు రాజధాని పట్నాలోనే నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో సీఎం నితీశ్కుమార్ ఇటీవల ప్రకటించిన కొవిడ్ నిబంధనలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.