న్యూఢిల్లీ, మే 19: 108 ఏండ్ల క్రితం 1914లో దాఖలైన ఓ భూ వివాదం కేసులో బీహార్లోని భోజ్పుర్ జిల్లా కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. కేసు వేసిన వారికే అనుకూలంగా తీర్పునిచ్చింది. 1910ల్లో బీహార్లోని కోయిల్వార్ గ్రామానికి చెందిన దర్బారీ సింగ్ ఖాన్ అనే వ్యక్తి నుంచి మూడెకరాల స్థలం కొనుగోలు చేశారు. ఖాన్ కొన్ని రోజులకు చనిపోయారు.
అయితే, తండ్రి అమ్మిన స్థలం తమదేనని వారసులు వాదించారు. దీనిపై దర్బారీ సింగ్ 1914లో కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి కేసు విచారణ సాగుతూనే వచ్చింది. తాజాగా జడ్జి శ్వేతా సింగ్ ఈ సాగతీతకు పుల్స్టాప్ పెట్టారు. దర్బారీ సింగ్ మునిమనవడు అతుల్ సింగ్కు అనుకూలంగా తీర్పునిచ్చారు. బీహార్ రాజధాని పాట్నాకు 40 కిలోమీటర్ల దూరంలోనే ఈ వివాదాస్పద స్థలం ఉంది.