న్యూఢిల్లీ, మే 11: బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకం చేయాలన్న బీహార్ సీఎం నితీశ్కుమార్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కలిసి మాట్లాడిన మరుసటి రోజే బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఝలక్ ఇచ్చారు. రానున్న సార్వత్రిక, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీలో గురువారం ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన ఈ మేరకు తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పాటు చేయనున్న థర్డ్ ఫ్రంట్లో తాను చేరనని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై మాత్రమే మోదీతో జరిగిన సమావేశంలో చర్చించినట్టు వివరించారు. జగన్నాథ్ ఎయిర్పోర్టు, అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారులపై మాట్లాడినట్టు చెప్పారు.