పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్కు కరోనా సోకింది. సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ఈ మేరకు బీహార్ సీఎం కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల్లో రోజువారీ కేసుల నమోదు రెండు లక్షలకు చేరింది. దీంతో సాధారణ ప్రజలతోపాటు రాజకీయ, క్రీడా, సినీ రంగ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కరోనా బారినపడి ఆదివారం కోలుకున్నారు. కాగా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కూడా కరోనా సోకింది. టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా వచ్చిందని సోమవారం తెలిపారు. స్వల్ప లక్షణాలు ఉండటంతో హోమ్ ఐసొలేషన్లో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవడంతోపాటు ఐసొలేషన్లో ఉండాలని ఆయన సూచించారు.