Nitish Kumar : బిహార్ సీఎం నితీష్ కుమార్ విపక్ష ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. బిహార్ అసెంబ్లీలో సోమవారం జరిగిన బలపరీక్షలో నితీష్ సర్కార్ విజయం సాధించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సహా విపక్ష నేతలపై నితీష్ కుమార్ విరుచుకుపడ్డారు.
తాను ఇండియా కూటమిలో ఉండటం కాంగ్రెస్కు ఇష్టం లేదని అన్నారు. విపక్ష కూటమి కోసం తాను ఎంతో కష్టపడ్డానని, విపక్షాలను ఏకం చేస్తుంటే తనను ఇబ్బంది పెట్టారని వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ కూడా తనకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు.
విపక్ష కూటమికి తాను నాయకత్వం వహించడం కాంగ్రెస్కు ఇష్టం లేదన్నారు. ఇక బిహార్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నితీష్ సర్కార్ నెగ్గింది. నితీష్కు 129 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా నిలిచారు. ఇక సభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి.
Read More :