పాట్నా: బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్య నిషేధం విధించే ఆలోచనలో ఉన్నది. దీనిపై నవంబర్ 16వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఇటీవల కల్తీ మద్యం తాగి 32 మంది మరణించిన నేపథ్యంలో సీఎం నితీశ్ ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యాన్ని స్వీకరించడం వల్ల బెట్టాయ్లో 15 మంది, గోపాల్గంజ్లో 13 మంది, సమస్తిపూర్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అయితే రాష్ట్రంలో మద్యనిషేధం విధించాలన్న ఉద్దేశంతో నితీశ్ గత శుక్రవారం ఓ సమావేశాన్ని నిర్వహించారు. కల్తీ సారా, మద్యం తయారు చేసేవారిపై కొరఢా రుళుపించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నది. గోపాల్గంజ్లో శనివారం 60 ప్రాంతాల్లో దాడులు జరిగాయి, ఆ ఘటనలో 19 మందిని అరెస్టు చేశారు.