పట్నా : బిహార్ బీజేపీ ఎమ్మెల్యే దర్భంగా జిల్లా కియోటి పోలీస్ స్టేషన్లో ఖాకీ కుర్చీలో కూర్చుని కేసు డైరీ గురించి వాకబు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత వారం ఆయన తన నియోజకవర్గానికి వెళ్లిన క్రమంలో పోలీసులు ఇద్దరు వ్యక్తులను కొట్టిన ఘటన గురించి తెలుసుకుని స్టేషన్కు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది.
పోలీస్ స్టేషన్కు వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే మురారి మోహన్ ఝా నేరుగా ఎస్హెచ్ఓ కుర్చీలో కూర్చుని కేసుకు సంబంధించిన ఫైల్ గురించి వాకబు చేశారు. అక్కడ పెద్దసంఖ్యలో ప్రజలు, జర్నలిస్టులు ఉన్నారని స్టేషన్ డైరీని బహిరంగంగా తాను చూపలేనని ఎస్హెచ్ఓ నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు.
ఎస్హెచ్ఓ మాటలను వినిపించుకోని ఎమ్మెల్యే స్టేషన్లో హంగామా చేశాడు. బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్ శనివారం ఈ వీడియోను ట్వీట్ చేస్తూ బిహార్లో ఎన్డీఏ ప్రభుత్వం సర్కస్ను నడుపుతోందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్పై మండిపడ్డారు. 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మురారి మోహన్ ఝా కియోటి స్ధానం నుంచి ఆర్జేడీ దిగ్గజ నేత, మాజీ మంత్రి అబ్ధుల్ బారి సిద్ధిఖిపై గెలుపొందారు.
मुख्यमंत्री नीतीश कुमार को यह हस्तक्षेप पसंद है।
भाजपा विधायक दबंगई से थानेदार की कुर्सी पर बैठकर मुख्यमंत्री के अधीन गृह विभाग के कारनामों, माफियाओं एवं अपराधियों से साँठगाँठ का हिस्सा व हिसाब लेने के लिए केस डायरी की माँग करने लगे।
बिहार में NDA का सरकार नहीं सर्कस चल रहा है। pic.twitter.com/de5KPhcsuM
— Tejashwi Yadav (@yadavtejashwi) April 2, 2022