పట్నా: బీహార్ రాష్ట్రం పట్నా జిల్లాలోని మానేరు జలాశయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 14 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవ ప్రమాదవశాత్తు మునిగిపోయింది. దాంతో పడవలోని ఏడుగురు ప్రయాణికులు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరగా, మిగతా ఏడుగురు గల్లంతయ్యారు.
పడవ మునక గురించిన సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దించారు.
Bihar | 7 people missing after a boat carrying 14 people capsized in Maner of Patna district today
7 people safe, 7 missing; NDRF team engaged in search and rescue operation, says ASI Satya Narayan Singh, PS Maner. pic.twitter.com/9TGGLEF4bU
— ANI (@ANI) December 30, 2022