దేశంలో చలామణీలో ఉన్న మొత్తం నోట్లలో రూ.2 వేల నోట్ల వాటా క్రమంగా తగ్గుతున్నది. 2017 మార్చిలో మొత్తం నోట్ల విలువలో ఈ పెద్ద నోటు వాటా 50.2 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి 13.8 శాతానికి పడిపోయింది.
ఇదే సమయంలో 500 రూపాయల నోట్ల చలామణీ పెరిగింది. ప్రస్తుతం మొత్తం నోట్ల విలువలో ఇది 73.3 శాతంగా ఉన్నది.