న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1:దేశవ్యాప్తంగా ఉన్న చిన్న చితక సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కీంను ప్రారంభించబోతున్నది. వచ్చే ఏప్రిల్ 1న రూ.9 వేల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీంను ప్రవేశపెట్టబోతున్నది.
ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశీయ టూరిజం రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా ‘దేఖో అప్నా దేశ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు.