లక్నో : యూపీలో యోగి ఆదిత్యానాధ్ సారధ్యంలోని బీజేపీ సర్కార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ భాఘేల్ అన్నారు. యోగి ప్రభుత్వం పట్ల ప్రతిఒక్కరిలో అసంతృప్తి నెలకొందని, రైతులు, యువత, దళితులు, వ్యాపారులు సహా అన్ని వర్గాల వారూ యోగి పనితీరుపై నిరాశతో ఉన్నారని వ్యాఖ్యానించారు. యోగి సర్కార్ అధికారం నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉందని చెప్పారు.
దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్ ప్లాంట్లు మూతపడి పవర్ క్రైసిస్ తలెత్తితే కేంద్ర ప్రభుత్వం దాటవేత ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. బొగ్గు దిగుమతులు కూడా నిలిచిపోవడంతో విద్యుత్ సరఫరాలపై పెను ప్రభావం పడనుదని సీఎం భూపేష్ భాఘేల్ ఆందోళన వ్యక్తం చేశారు. లఖింపూర్ ఖేరి ఘటనలో రైతుల మరణాల పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసిలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ యోగి ఆదిత్యానాధ్ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బాధిత రైతులను కలిసేందుకు వచ్చిన తనతో పాటు ప్రియాంక గాంధీని యోగి సర్కార్ అడ్డుకుందని విమర్శించారు.