న్యూఢిల్లీ, మార్చి 17: మహదేవ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భూపేశ్ బఘేల్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది.
ఈడీ ఫిర్యాదు ఆధారంగా ఆ రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) బఘేల్ను నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. దీనిపై బఘేల్ స్పందిస్తూ, బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగా కేసు పెట్టారని, అక్రమ నగదు లావాదేవీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.