Gold loot | బంగారం ఆభరణాల వ్యాపారిపై తుపాకులు ఎక్కుపెట్టారు. సుమారు రూ.20 లక్షల విలువైన బంగారం ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్ నగర శివారుల్లోని జన్లా ప్రాంతంలో చోటు చేసుకున్నది. ఇద్దరు ఆగంతకులు.. జన్లా ప్రాంతంలోని సాగరికా జువెల్లర్స్లో చొరబడి.. దుకాణ యజమానిపై అతి సమీపం నుంచి తుపాకీ ఎక్కు పెట్టారు. బంగారం దోచుకున్నారు.
ఈ సంగతి తెలిసి స్థానికులు దొంగలను వెంటాడారు. దీంతో ఆ ఆగంతకులు కాల్పులు జరుపుతు పారిపోయారు. ఈ దృశ్యాలన్నీ దుకాణం బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఈ ఘటనపై దుకాణం యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా పూర్వాపరాలు దుకాణ యజమాని, సిబ్బందిని అడిగి పోలీసులు తెలుసుకున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం దొంగలు దోచుకెళ్లిన బంగారం విలువ రూ.20 లక్షలు ఉంటుందని చెబుతున్నారు.