బఠిండా, ఏప్రిల్ 24: ఖలిస్థానీ వేర్పాటువాద నేత, ‘వారిస్ పంజాబ్ దే’ అధ్యక్షుడు అమృత్పాల్ అరెస్టులో భింద్రన్వాలే మేనల్లుడు జస్బీర్ సింగ్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. అరెస్టుకు ముందు అమృత్పాల్ తనను కలిశాడని, పోలీసుల ముందు లొంగిపోయేలా తానే అమృత్పాల్ను సంసిద్ధం చేసినట్టు జస్బీర్ సింగ్ వెల్లడించారు. శనివారం రాత్రి నుంచే పోలీసులు గ్రామంలో ఉన్న విషయాన్ని తెలుసుకొన్న అమృత్పాల్.. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు గురుద్వారా చేరుకొన్నాడని తెలిపారు. గురుద్వారా బయట అమృత్పాల్ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొన్న విషయం తెలిసిందే.